తిరుమల ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనాలు
Published on: Sat Jan 11, 2025 8:55AM

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా సాగుతున్నాయి. భక్తులు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా ప్రశాంతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకునేలా టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది.
వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున తరుమల స్వామివారికి మొత్తం 60 వేల 94 మంది దర్శించుకున్నారు. వారిలో 14 వేల 94 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 45 లక్షల రూపాయలు వచ్చింది.


