ఉప్పల్ స్టేడియం పేరు మారిస్తే ఊరుకోం.. వీహెచ్

 

ఈ మధ్య నెహ్రూ-గాంధీ కుటుంబాల పేర్లు పలు కట్టడాలకు, రోడ్లకు పెట్టడంపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు బీజేపీ తీరుపై మండిపడ్డారు. హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ స్టేడియం పేరు మార్చాలన్న ఆలోచన విరమించుకోవాలని.. ఉప్పల్ స్టేడియం పేరు మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెండేళ్ల బీజేపీ పాలనలో మాటలు తప్ప చేతలు లేవని విమర్శించారు. నెహ్రూ కుటుంబంపై బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆయన ఆరోపించారు. రాజ్యసభకు పోటీ చేయాలా? వద్దా? అన్న దానిపై రేపటి కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం తరువాత ఓ స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు.