కేసీఆర్‌ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు

 

తెలంగాణ సీఎం కేసీఆర్ రీసెంట్ గా పీఎం మోడీని కలిసి వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆ వినతిపత్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ఆర్థికసాయం, ప్రత్యేక హైకోర్టు నిర్మాణం, వెనకబడిన జిల్లాలకు నిధులు మొదలైన అంశాలతో పాటు కొత్త సచివాలయం నిర్మాణానికి స్థల కేటాయింపు అంశం కూడా ఉన్న సంగతి తెల్సిందే.. అయితే తాజాగా ఈ విషయం మీద స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్.హనుమంతరావు, కేసీఆర్ మీద విమర్శలు చేసారు.. వాస్తు పేరుతో కేసీఆర్ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని.. ఇప్పుడున్న సచివాలయానికే కేసీఆర్ సరిగా రావడం లేదని, అలాంటప్పుడు కొత్త సచివాలయం ఎందుకని వీహెచ్ విమర్శించారు.