చిరుతను ఎదుర్కొని చంపిన మహిళ

 

ఒంటరిగా వున్న వారి మీద చిరుత దాడి చేస్తే పరిస్థితి ఎలా వుంటుంది. అలాంటి సమయంలో ఎంతటి వీరాధి వీరులైనా చేతులెత్తేసి ఇష్టదైవాన్ని తలచుకోవడం మినహా చేసేది ఏమీ వుండదు. ఒక వేళ చిరుత నుంచి పారిపోదామని పరిగెత్తినా, చెట్టెక్కినా కూడా ప్రయోజనం వుండదు. కానీ, ఇలాంటి పరిస్థితే ఓ 56 ఏళ్ళ మహిళకి ఎదురైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లా కోడి బోడ్నా గ్రామానికి చెందిన కమలాదేవి అనే మహిళ గొడ్డలి, కొడవలి తీసుకుని వ్యవసాయ పనులకు వెళ్ళింది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై వున్న ఆమె మీద చిరుతపులి అకస్మాత్తుగా దాడి చేసింది. అయితే కమలాదేవి ఎంతమాత్రం భయపడకుండా ఆ చిరుత పులి మీద ఎదురుదాడి చేసింది. తన దగ్గర వున్న కొడవలి, గొడ్డలి సాయంతోనే చిరుతపులిని ఎదుర్కొంది. ఆ చిరుత పులికి, ఆమెకి మధ్య దాదాపు 30 నిమిషాలపాటు పోరాటం జరిగింది. ఈ పోరులో కమలాదేవి తీవ్రంగా గాయపడినప్పటికీ చిరుతపులిని చంపేసింది.