భారత్ భూభాగంలో చైనా బలగాలు నిజమే..

 


భారత్ కు చైనా రోజు రోజుకి పెద్ద తలనొప్పిలా తయారవుతోంది. పక్కనే ఉంటూ.. మీకు సహకరిస్తాం అంటూ చెబుతూనే చేసే పనులన్నీ చాలా సైలెంట్ గా చేసేస్తుంది. తాజాగా మరో ఘటన బయటపడింది. భారత భూభాగంలోకి మరోసారి చైనా బలగాలు చొచ్చుకొచ్చాయి. ఈ విషయాన్ని ఉత్రరాఖండ్ సీఎం హరీశ్ రావత్ స్వయంగా చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోకి చైనా బలగాలు చొరబడిన విషయం నిజమేనని.. చైనా బలగాలు మన భూభాగంలోకి వచ్చినప్పటికీ అక్కడ కీలకమైన కాలువ దగ్గరికి వెళ్లలేదని, ఇది భారత్‌కు సంబంధించినంతవరకు మంచి విషయమని సీఎం రావత్ చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తాము భావిస్తున్నామన్నారు. కాగా గతంలోనూ చైనా పలుమార్లు ఉత్తరాఖండ్‌లోకి చొరబడి.. 'చైనా' అనే బోర్డులు పెట్టింది. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరగా స్పందించి ఎంత త్వరగా చర్యలు చేపడితే అంత మంచిది. లేకపోతే మన భూభాగంలోకి వచ్చి.. మాదే అని చెప్పే సత్తా చైనాకు ఉంది మరి.