నల్గొండ ఎంపీ బరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి!!

 

లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ.. తన మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి తెలంగాణలో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని, అసెంబ్లీ ఫలితాలు రిపీట్ కాకుండా చూడాలని భావిస్తోంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం లోక్ సభ ఎన్నికల్లో బలమైన నేతలను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే మల్కాజిగిరి అభ్యర్థిగా టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పోటీకి దింపింది. అయితే ఇప్పుడు నల్గొండ బరిలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నేతలు బరిలో ఉంటేనే టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వగలమని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. మొదట నల్గొండ నుంచి జానారెడ్డి లేదా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేసులో ఉంటారని ప్రచారం జరిగింది. కానీ చివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు కాంగ్రెస్ అధినాయకత్వం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇక భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు కూడా దాదాపుగా ఖరారైందని సమాచారం.