ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న కాంగ్రెస్

 

ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తుంది.. మరోవైపు తెలంగాణాలో అధికారంలో ఉన్న తెరాస, అలానే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా ముందస్తుకు వెళ్లాలని చూస్తున్నాయి.. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే, ముందస్తు గురించి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తానని, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న విపక్షాలు ముందస్తు ఎన్నికలు వస్తే తేల్చుకోవాలని సవాల్ విసిరారు.. కేసీఆర్ సవాల్‌ను పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వీకరించారు.. 2018 డిసెంబర్‌లో అయినా, 2019 మేలో అయినా లేదా ఈరోజైన సరే.. ఎప్పుడు ముందస్తు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.. ముందస్తు ఎన్నికలు తెలంగాణ ప్రజలకు శుభవార్త అని, కేసీఆర్ ప్రభుత్వాన్ని ముందే సాగనంపేందుకు ఉపయోగపడుతుందని ఉత్తమ్ తనదైన శైలిలో కేసీఆర్ సవాలుకు కౌంటర్ ఇచ్చారు.