Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అన్నను కాదని ఉత్తమ్ సిఎం అంటూ రాజగోపాల్ రెడ్డి కొత్త రాగం
posted on: Aug 30, 2024 5:35PM
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్తా ఎక్కువే . తెలంగాణలో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. గత బిఆర్ఎస్ సర్కారు అవినీతి, అహంకారం వల్ల అధికారం కోల్పోయింది. ఐక్యతారాగం లేకపోవడం వల్ల పదేళ్లు కాంగ్రెస్ కూడా అధికారంలో రాలేకపోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అయితే ఆ క్రెడిట్ మాత్రం అప్పటి టిఆర్ఎస్ అధినేత కెసీఆర్ కొట్టేశారు. టిఆర్ ఎస్ బిఆర్ఎస్ గా మారిన తర్వాత అసలు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీని ఇతర పార్టీలు ఓడించవు. అంతర్గత కుమ్ములాటల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోయాయి. ఇది చరిత్ర. చరిత్ర చెప్పిన గుణ పాఠాలతో ఇన్నాళ్లు బుద్దిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు మెల్లి మెల్లిగా బయటపడుతున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవికి అర్హుడు అని స్వయంగా ఆయన భార్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అంటూ ఒక వర్గం ప్రచారం చేసింది. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటూ కొత్త రాగం అందుకున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నీటి పారుదల పనులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజగోపాల్ ఈ మాట అన్నారు. బిజెపి నుంచి కాంగ్రెస్లో చేరి మునుగోడు టికెట్ పై గెలిచిన రాజగోపాల్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. తన నాలుక మీద పుట్టు మచ్చలు ఉన్నాయి కాబట్టి నిజం అవుతుందన్నారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.



.webp)


