సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా

 

సిలబస్‌పై స్పష్టత లేనందున యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీని కోరడంతో యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసింది. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 24న నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. ఇప్పుడు పరీక్షను వాయిదా వేసిన నేపథ్యంలో పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై త్వరలోనే యూపీఎస్సీ అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది.