మోడీ ఉపవాస దీక్ష..ఎందుకో తెలుసా..?

భారత ప్రధాని నరేంద్రమోడీ ఉపవాసం చేస్తున్నారు. కారణం ఏమిటో తెలుసా..నవరాత్రి ఉత్సవాలు..దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి..చిన్నా, పెద్దా అంతా ఉత్సవాల్లో తలమునకలై ఉన్నారు. చాలా మంది భక్తులు ఈ తొమ్మిది రోజుల పాటు చాలా మంది ఉపవాస దీక్ష చేస్తారు..ప్రధాని నరేంద్రమోడీ కూడా దీక్షను చేయాలని నిర్ణయించుకున్నారు..ఇప్పుడే కాదు గత 40 ఏళ్లుగా ఆయన ప్రతి నవరాత్రికి ఉపవాసం ఉంటున్నారు..ఇప్పుడు ప్రధాని అయిన తర్వాత కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈ దీక్షలో భాగంగా 9 రోజుల పాటు ఆయన ఎలాంటి ఆహారం తీసుకోరు..కేవలం గోరు వెచ్చని నీటిని మాత్రమే తీసుకుంటారు.