మెగా ఫ్యామిలీలో విషాదం.. ఉపాస‌న తాతయ్య క‌న్నుమూత

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ.. ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని దోమ‌కొండ‌లో జ‌న్మించిన ఉమాప‌తి రావు ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా పని చేశారు. ఆయన మృతికి ఉపాసన ట్విట్టర్‌ వేదికగా సంతాపం తెలిపారు. ‘మా తాత‌య్య కె.ఉమాపతి రావు(జూన్‌ 15,1928- మే 27, 2020) గొప్ప విలువలు, నిస్వార్థం, మానవత్వం గల వ్యక్తి. ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువే. ఉర్దూలో ఆయన రాసిన రచనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీటీడీ తొలి ఈవోగా పనిచేశారు. అనేక గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి తాత‌య్య‌’ అంటూ ఉపాసన భావోద్వేగ ట్వీట్‌ చేశారు.