యుపిఎకు ఓంప్రకాష్‌ గుడ్‌బై

 

యుపిఏ కు మరో ఎదురు దెబ్బ తగిలింది ఇప్పటికే తెలంగాణ అంశంతో రాష్ట్రంలో పట్టుకోల్పోతున్న కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో మరో ఎంపి దూరమయ్యాడు. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తూ వస్తున్న స్వతంత్ర అభ్యర్ధి ఎంపి ఓం ప్రకాష్‌ యాదవ్‌ ఆ పార్టీకి తన మద్దతు ఉపసంహరించుకున్నారు.

ధర పెరుగుదల, అవినీతి, రాజకీయ ప్రత్యర్థుల పై కాంగ్రెస్‌ అవలంభిస్తున్న ప్రతీకార చర్యలు లాంటి అంశల నేపధ్యంలో ఆ పార్టీకి ఆయన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు ఉపసంహరణ లేఖ అందించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓం ప్రకాష్‌ గతంలో పలు సందర్బాల్లో దేశానికి దమ్మున నాయకుడు కావాలంటూ స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. పలు సందర్బాల్లో నరేంద్ర మోడిని బహిరంగంగానే పొగిడారు. ఈ నేపధ్యంలో ఆయన బిజిపిలో చేరే అవకాశం ఉందన్న వర్తాలు వినిపిస్తున్నాయి.