గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ముఖ్య అనుచరుడి ఎన్ కౌంటర్

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఎనిమిది మంది పోలీసులను కిరాతకంగా హత్య చేసిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర దూబే ను ఈరోజు తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసారు. ఈ నెల 3న వికాస్ దూబే ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన డిఎస్పీ తో సహా ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపి తరువాత వారి శరీరాలను ముక్కలుగా చేసిన వారిలో ఈ అమర్ దూబే ముఖ్యుడిగా పోలీసులు గుర్తించారు.

ఇది ఇలా ఉండగా ప్రధాన నిందితుడు వికాస్ దూబే హర్యానా లోని ఫరీదాబాద్ లో ఒక హోటల్ లో తలదాచుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో యూపీ పోలీసులు ఫరీదాబాద్ చేరుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే వికాస్ దూబే కు  దారుణమైన నేర చరిత్ర తో పాటు రాజకీయంగా పెద్ద తలకాయల తో లింకులు కూడా ఉండడంతో ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో అని ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.