యూపీలో మరో రైలు ప్రమాదం...
posted on Aug 23, 2017 11:09AM
యూపీలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం యూపీలో ఉత్కల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 30 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ ఘటన మరువకముందే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...అజమ్గఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న కైఫియత్ ఎక్స్ప్రెస్ ఉత్తరప్రదేశ్లోని ఔరియా జిల్లాలో పట్టాలు తప్పింది. దాదాపు 10 బోగీలు పక్కకు జరిగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ...దాదాపు 70 మంది గాయపడినట్టు తెలుస్తోంది. వారందరినీ అచ్చాల్దాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ హోంశాఖ కార్యదర్శి అనిల్కుమార్ తెలిపారు. పాటా, అచ్చాల్దా రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున 2.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.