రాష్ట్రపతిభవన్‌లో కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారం..

కేంద్రమంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్త కేంద్రమంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారిచేత ప్రమాణం చేయించారు. తొలుత ప్రకాశ్ జవదేకర్ ప్రమాణం చేశారు. దీంతో ఆయనకు క్యాబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించినట్లైంది. ఆపై సహాయమంత్రిగా మధ్యప్రదేశ్, మాండ్లాకు చెందిన బీజేపీ ఎంపీ ఫగ్గస్ సింగ్ కులస్తే, పశ్చిమబెంగాల్, డార్జీలింగ్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎస్ఎస్ అహ్లూవాలియా, కర్ణాటక బీజాపూర్‌ ఎంపీ రమేశ్ చందప్ప జిగజినాగి తదితరులు ప్రమాణం చేశారు.