Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తగాదాలొద్దు.. ప్రణబ్
posted on: Jul 3, 2015 3:23PM

తెలుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాలని.. రెండు రాష్ట్రాల మధ్య వున్న తగాదాలు రాష్ట్రా అభివృద్దికి అవరోధమవుతాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్టీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు రాసిన ఉనికి పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పరిస్థితి గురించి పైవిధంగా అన్నారు. ఇష్టమున్నా.. లేకపోయినా పొరుగురాష్ట్రాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని.. దేశాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంటే ఒక్క ఏపీకి.. తెలంగాణ కు మాత్రమే ఇష్టంకాదు.. దేశ ప్రజలందరికీ హైదరాబాద్ అంటే ఇష్టమని.. అన్ని సంస్కృతుల సమ్మేళనం హైదరాబాద్ అని అన్నారు. తనకు విద్యాసాగర్ రావు ఎంపీగా ఉన్నప్పటి నుండి తెలుసని.. తాను రాసిన ఉనికి పుస్తకం భావితరాలకు స్ఫూర్తి కావాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక తాను రాష్ట్రపతి ప్రణబ్ వద్దకు వెళ్లానని.. అంతకుముందే తాను ఓసారి కలిసినప్పుడు అంత తొందరపాటు వద్దని, కొంత ఆవేశం తగ్గించుకోమని సూచించారన్నారు. విద్యాసాగర్ రావు విలక్షణమైన రాజకీయ నాయకుడు.. ఉద్యమ కాలంలో ఆయనతో కలిసి పని చేసే అవకాశం కలిగిందని గుర్తు చేసుకున్నారు.



.png)


