బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ఐసీయూకు తరలింపు!

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. కరోనా లక్షణాలు తీవ్రం కావడంతో ఆయన్ను ఐసీయూకు తరలించారు. లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. 

ఇది కేవలం ఆరోగ్యం విషమించకుండా, వైద్యుల సలహా అనుసరించి ముందు జాగ్రత్త కోసం తీసుకున్న చర్య అని 10-డౌనింగ్ స్ట్రీట్ (ప్రధానమంత్రి కార్యాలయం) తెలిపింది. 

కరోనా లక్షణాలు తీవ్రం కావడంతో ఆయన్ను ఐసీయూకు తరలించారు. ఆదివారం సాయంత్రం నుంచి మరింత ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్యులు స్పెషల్ కేర్ తీసుకొని చికిత్స అందిస్తున్నారు. బోరిస్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా ప్రధాని ట్రంప్ స్పందించారు. బోరిస్‌కు మంచి వైద్యం అందించేలా డాక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. తనకు, అమెరికాకు బోరిస్ మంచి స్నేహితుడని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేసుకున్నారు.