సచిన్ గౌరవార్థం బ్రిటన్‌లో బంగారు నాణెం!

 

 

 

క్రికెట్ దిగ్గజం సచిన్ ఆ రంగానికి అందించిన సేవలను గుర్తిస్తూ, గౌరవిస్తూ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓ అరుదైన, అమూల్యమైన బంగారు నాణాన్ని విడుదల చేసింది. ఈ నాణెం విలువ 12 వేల పౌండ్ల స్టెర్లింగ్ వుంటుంది. ఈ నాణానికి పూర్తి చట్టబద్ధత వుంటుందని ఈస్ట్ ఇండియా కంపెనీ తెలిపింది. క్రికెటర్‌గా 24 ఏళ్ళపాటు అత్యత్తమ సేవలు అందించినందుకు, ఆయన్ని గౌరవిస్తూ అరుదైన నాణాన్ని విడుదల చేశామని ఈస్ట్ ఇండియా కంపెనీ తెలిపింది. 200 గ్రాముల బరువుతో ఉండే 210 బంగారు నాణాలు విడుదల చేశామని ఆ సంస్థ తెలిపింది. ఈ నాణాన్ని అందమైన బాక్సులో అమర్చి విక్రయిస్తారు. ఈ నాణాన్ని కొనుగోలు చేసిన వారికి అధికారిక ధ్రువపత్రంతోపాటు సచిన్ ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్‌ని కూడా అందిస్తున్నారు. తన పేరిట ఈస్ట్ ఇండియా కంపెనీ నాణాన్ని విడుదల చేయడం క్రికెట్‌కి తాను చేసిన సేవలకు గుర్తింపుగా దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సచిన్ టెండూల్కర్ అన్నారు.