నర్సారావుపేట లో రెండు రెడ్ జోన్లు

గుంటూరు జిల్లా నర్సరావు పేట లో నిన్న మృతి చెందిన మల్లెల శ్రీనివాసరావుకి కరోనా పాజిటీవ్ గా నిర్దారణ అయినట్టు ఆర్ డీ ఓ, అలాగే డి ఎస్ పి ప్రకటించారు. శ్రీనివాసరావు నివాసం ఉండే వరవకట్ట, అలాగే అతను పని చేస్తున్న రామిరెడ్డిపేటని రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. రెండు ప్రాంతాలలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయబడుతుందని,  ఇక నుండి రెడ్ జోన్ ప్రాంతంలో ఎవ్వరూ కూడా బయటికి రావడానికి వీలులేదు. ప్రత్యేక వైద్య బృందాలతో ప్రతి ఇంటిని సర్వే చేపించడం జరుగుతుందని పోలీసు, రెవిన్యూ అధికారులు చెప్పారు. ప్రజలు కరోనా మహమ్మారి నుండి తమ ప్రాణాలకు ముప్పు అటు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉందన్నారు. ప్రజలు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరించారు.