ఏపీ కొత్త మంత్రులు వీళ్లే..!!

మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులకు కొత్త వారి పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రెండు మంత్రి పదవుల్లో ఒకటి శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు కు కేటాయిస్తారని సమాచారం. మోపిదేవి మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు కాగా అప్పలరాజు కూడా అదే సామాజిక వర్గం. ఈయన స్వతహాగా డాక్టర్. ఇటీవల కరోనా విషయంలో అప్పలరాజు స్థానికంగా తీసుకున్న చర్యలు సీఎంను ఆకర్షించాయి. కేబినెట్ లోకి తీసుకుంటే అప్పలరాజుకు వైద్య ఆరోగ్య శాఖ అప్పగించవచ్చని తెలుస్తోంది.

పిల్లి సుభాష్ చంద్ర బోస్ తో ఖాళీ అయిన స్థానాన్ని శెట్టి బలిజ వర్గానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కు ఇవ్వనున్నారని సమాచారం. పిల్లి సుభాష్ కూడా శెట్టి బలిజ సామాజిక వర్గం వారే. మొత్తానికి ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను, మళ్ళీ అవే సామజిక వర్గాలకు చెందిన నేతలకు ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది.