ఏపీలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు...

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై ప్రకటన చేయడంలో భాగంగా ఆయన విడుదల చేసిన 20 పేజీల ప్రకటనలో అనేక అభివృద్ధి పనుల గురించి వెల్లడించారు. వాటర్, పవర్, గ్యాస్, రోడ్, బ్రాడ్ బ్యాండ్లకు ప్రత్యేకంగా గ్రిడ్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానశ్రయాలుగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. అనంతపురంలో కరవు నివారణకు బిందు సేద్యం, తుంపర సేద్యాలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నామని వివరించారు. అలాగే శ్రీకాకుళంలో విమానాశ్రయం ఏర్పాటు చేసి శ్రీకాకుళాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు.