విశాఖ క్రేన్ ప్రమాదంపై విచారణకు రెండు కమిటీలు
posted on Aug 1, 2020 5:37PM
విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ లో జరిగిన క్రేన్ ప్రమాదంపై విచారణకు రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రకటించారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ నిపుణులతో ఒకటి, ప్రభుత్వ ఇంజినీరింగ్ అధికారులతో మరో కమిటీ వేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి హెచ్ఎస్ఎల్ ఛైర్మన్తో ఇప్పటికే చర్చించినట్టు చెప్పారు.
క్రేన్ ప్రమాదంలో మొత్తం 11 మంది మృతి చెందారని.. ఎవరూ గాయపడలేదని కలెక్టర్ తెలిపారు. మృతుల్లో పది మంది వివరాలు గుర్తించామన్న కలెక్టర్ ఒకరి వివరాలను గుర్తించాల్సి ఉందని అన్నారు. క్రేన్ ఆపరేషన్, మేనేజ్మెంట్లో మొత్తం మూడు కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్నాయని, మృతుల్లో నలుగురు హెచ్ఎస్ఎల్ ఉద్యోగులుండగా.. మిగిలిన ఏడుగురు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు చెందినవారని వెల్లడించారు.