శ్రీకృష్ణ జన్మస్థానానికి యాంకర్‌!!

 

పది కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ ఓ విద్యాసంస్థ యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో టీవీ యాంకర్ హర్షవర్ధన్‌తోపాటు మరో నలుగురిని పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు వీరికి పదిహేను రోజులపాటు రిమాండ్ విధించింది. దాంతో ఈ ఐదుగురినీ పోలీసులు ఏలూరులోని సబ్ జైలుకు తరలించారు. ఇదిలా వుండగా టీవీ యాంకర్ హర్షవర్ధన్ కారణంగా తాము కూడా ఎంతో నష్టపోయామని కొంతమంది ఇప్పుడు బయటకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీ క్రైం యాంకర్ హర్షవర్ధన్ నేర చరిత్ర గురించి మరింత లోతుగా పరిశోధన జరపాల్సిన అవసరం వుందని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.