తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య గొడవ... కొట్టుకునేదాక వచ్చిన వాగ్యుద్ధం

 

 

తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో ఫిరాయింపులపై ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టీకాంగ్ ఎమ్మెల్యేలు గొడవకు దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.... పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి మధ్య మొదలైన వాగ్వాదం... పెద్ద గొడవకు దారితీసింది. పార్టీ ఎందుకు మారావంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించడంతో పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి దీటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం జరుగుతుండగా సర్దిచెప్పేందుకు వచ్చిన భట్టివిక్రమార్కపైనే ఉపేందర్ రెడ్డి ఫైరయ్యాడు. దాంతో ఉపేందర్ రెడ్డితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క గొడవకు దిగారు. ఈ ముగ్గురి వాగ్యుద్ధంతో అసెంబ్లీ ఇన్నర్ లాబీలు దద్దరిల్లిపోయాయి. ఒకరినొకరు కొట్టుకునే స్థాయిలో వాగ్యుద్ధం చేరడంతో మిగతా ఎమ్మెల్యేలు కల్పించుకుని సర్దిచెప్పారు. అయినాసరే గొడవ సద్దుమణగకపోవడంతో... ముగ్గురినీ తలో దిక్కుకు తీసుకెళ్లడంతో... అప్పటికి వివాదం ముగిసింది.