టర్కీలో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 9మంది పోలీసులు మృతి..


వరుస ఉగ్రవాదుల దాడులతో టర్కీ వణికిపోతుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయి బీభత్సం సృష్టించారు ఉగ్రవాదులు. వివరాల ప్రకారం.. టర్కీలోని సిర్నక్ ప్రాంతంలోసిజర్‌ నగర పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో భారీ పేలుడుకు పాల్ప‌డ్డారు. ఈ పేలుడులో తొమ్మిదిమంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 64 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయ పడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పేలుడు వలన పోలీసు కార్యాల‌య బిల్డింగ్ పూర్తిగా ధ్వంస‌మైంది. అయితే ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించలేదు. కానీ కుర్దిష్ ఉగ్ర‌వాదులే ఈ దాడి చేసిన‌ట్లు అనుమానిస్తున్నారు.