టీఆర్ఎస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు
posted on Sep 5, 2014 5:57PM
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నాడు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో తుమ్మల టీఆర్ఎస్లో చేరారు. తుమ్మలకు గులాబీ కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. తుమ్మలతోపాటు పలువురు ఖమ్మం జిల్లా నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ‘‘కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ సాధించారు. కేసీఆర్ నా చిరకాల మిత్రుడు. కేసీఆర్ లక్ష్యసాధనలో భాగస్వామిని కావాలనే టీఆర్ఎస్లో చేరాను. రాష్ట్ర రాజకీయాలలో మార్పులకు నేను, కేసీఆరే కారణం. తెలంగాణను కోటి రతనాల వీణగా మార్చాల్సిన అవసరం వుంది. గుజరాత్ కంటే ఎక్కువగా తెలంగాణను అభివృద్ధి చేసే శక్తి కేసీఆర్కి వుంది’’ అన్నారు.