గంటకు 500 మందికి దర్శనం?శ్రీవారి దర్శనం పై టిటిడి కసరత్తు

ప్రతి రోజు 14 గంటల పాటు భక్తులును దర్శనానికి అనుమతించే విధంగా ఏర్పాట్లను చేయాలని టిటిడి కసరత్తు చేస్తోంది.
గంటకి 5 వందల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి మూడు రోజుల పాటు టిటిడి ఉద్యోగులను అనుమతించేలా ఏర్పాట్లు చేయాలని సమాచారం. అటు తరువాత తిరుమల, తిరుపతిలో వున్న స్థానికులను ప్రయోగాత్మకంగా 15 రోజులు పాటు అనుమతించేలా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నారు.

రోజుకి 7 వేల నుండి 10వేల మంది భక్తులకు పరిమితం చేస్తుంది.
ఆన్ లైన్ లో స్లాట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునేలా ఏర్పాట్లు పరిశీలిస్తోంది.మొదట సర్వదర్శనం,ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను భక్తులకు అందుభాటులో వుంచాలని భావిస్తోంది. టిక్కెట్లను పొందిన భక్తులను మాత్రమే అలిపిరి వద్ద అనుమతించేలా ఏర్పాట్లు చేయబోతోంది. ప్రయోగాత్మక పరిశీలన పూర్తి అయిన తరువాత అంచెల వారిగా చిత్తూరు జిల్లా వాసులు... అటు రాష్ర్ట వ్యాప్తంగా భక్తులను అనుమతించాలని టిటిడి భావిస్తున్నట్టు సమాచారం.

వసతి గదులను ఇద్దరికి మాత్రమే పరిమితం చేసేలా చేయాలని తెలుస్తోంది.అలిపిరి, నడకమార్గంలోనే భక్తులను క్షుణంగా తనిఖీ చేసేలా కచ్చితమైన నిబంధనలతో ఏర్పాట్లను చేస్తోంది.
కరోనా వైరస్ నుంచి పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత అందరిని దర్శనానికి అనుమతించేలా చేయాలని టిటిడి యోచిస్తోంది.