సునామీ ముప్పు లేదు: ఎన్ఎమ్డీఏ
Published on: Wed Apr 11, 2012 5:12PM
న్యూఢిల్లీ
: హిందూ మహాసముద్రంలో సునామీ వచ్చే సూచన లేదని జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్ఎమ్డీఏ ) వెల్లడించింది. సునామీ వల్ల భారత్కు ఎలాంటి ప్రమాదం లేదని ఎన్ ఎమ్ డీఏ తెలిపింది. అండమాన్ తీరంలోనూ సునామీ అలల జాడలేదని, ఆగ్నేయాసియా దేశాల్లో సునామీ ప్రభావం కొంత ఉండొచ్చని ఎన్ఎమ్డీఏ తెలిపింది. రాష్ట్ర తీరప్రాంతంలో అలలు ముందుకు రావొచ్చు తప్ప సునామీ రాదని స్పష్టం చేసింది. భారత్లో భూ ప్రకంపనలే తప్ప సునామీ జాడ లేదని అమెరికా ఓ ప్రకటనలో తెలిపింది.


