జవాబు ప్రతాలను ఆన్‌లైన్‌లో పెట్టండి: హైకోర్టు

 

తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకలపై దాఖలైన పిటిషన్‌ను ఈరోజు హైకోర్టు విచారించింది. ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలను ఈనెల 27వ తేదీన విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది.

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ పూర్తి చేశామని ఇంటర్‌ బోర్డు.. కోర్టుకు తెలిపింది. ఫలితాలను 16వ తేదీన విడుదల చేయనున్నామని చెప్పింది. సమాధాన పత్రాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని సూచించిన కోర్టు.. ఫలితాలు, సమాధాన పత్రాలను ఒకేసారి ప్రకటించాలని ఆదేశించింది. ఈక్రమంలో మే 27న ఫలితాలు ప్రకటించి, సమాధాన పత్రాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని సూచిస్తూ తదుపరి విచారణను జూన్ 6 కు వాయిదా వేసింది. అదేవిధంగా ఫలితాలు ప్రాసెస్‌ చేసిన గ్లోబరీనా సంస్థకు కోర్టు నోటీసులు జారీ చేసింది.