సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... ఆసక్తిగా తిలకించిన మెలానియా...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ భారత ప్రధాని నరేంద్రమోడీ కలిసి అహ్మదాబాద్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మొతేరా స్టేడియం వరకు దాదాపు 22 కిలోమీటర్ల మేర రోడ్ షో చేశారు. పెద్దఎత్తున చేరుకుని రోడ్డుకిరువైపులా నిలబడి స్వాగతం పలుకుతున్న ప్రజలకు... కారులో నుంచే ట్రంప్ దంపతులు... అభివాదం చేశారు. ఇక, మార్గం మధ్యలో సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు సందర్శించారు. గాంధీజీ వినియోగించిన వస్తువులను ఆసక్తిగా తిలకించారు. అయితే, సబర్మతి ఆశ్రమానికి వచ్చిన ట్రంప్ దంపతులకు తెల్లని ఖాదీ వస్త్రాలను మెడలో వేసి మోడీ ఆహ్వానించారు. ఆ తర్వాత, మోడీ, ట్రంప్ కలిసి గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం సబర్మతి ఆశ్రమాన్ని దగ్గరుండి చూపించారు మోడీ.