ట్రంప్ కు మండింది.. చైనాకు మూడింది

కరోనా వైరస్ విలయతాండవం తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ చైనా లో మొదలైనా కూడా ప్రస్తుతం చైనాలో పెద్దగా దీని ప్రభావం లేదు కానీ ప్రపంచ దేశాలు మాత్రం అల్లకల్లోలం అవుతున్నాయి. మరి ముఖ్యంగా అమెరికాలో ఐతే గత ఐదు నెలలు గా పరిస్థితి దారుణంగా ఉంది. నిన్న ఒక్క రోజే అక్కడ 46,639 పాజిటివ్ కేసులు రాగా 764 మంది చనిపోయారు. అంతే కాకుండా అమెరికాలో ముందు ముందు రోజుకు లక్ష వరకు కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనల కు గురి అవుతున్నారు. తాజాగా కరోనా ను కంట్రోల్ చేసే అంశంపై తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ట్రంప్ ఇంకో సారి చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా దారుణంగా వ్యాపించింది. అది అమెరికాకు చాల తీవ్ర నష్టం కలిగించింది. నాకు చైనా పై చాల తీవ్రమైన కోపం ఉంది. ప్రజలు కూడా దీన్ని చూస్తున్నారు. దీన్ని కూడా నేను ఫీల్ అవుతున్నాను" అని ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో తాజాగా ట్వీట్ చేశారు.

ఐతే ట్రంప్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం లో కొంత న్యాయం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో నే కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో అమెరికా ఒకటి. అక్కడ దాదాపు 27 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. వైరస్ బారిన పడిన వారందరికీ ట్రీట్‌మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడిందే కాకుండా అటు హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ పిపియి కిట్లు, మందులు ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతున్న పరిస్థితి. అంతే కాకుండా సాధారణ పరిస్థితులు లేక పోవడం తో ఆర్థికంగా కూడా ఎక్కడ లేని నష్టం జరుగుతోంది. దీనికంతటికి చైనాయే కారణం అని ట్రంప్ ఫైర్ అవుతున్నారు.

దీనికి తోడు తాజాగా చైనాలో మరో భయంకరమైన G4 EA H1N1 అనే వైరస్ వెలుగులోకి రావడంతో... ప్రపంచ దేశాలన్నీ ఇపుడు "చైనా వారి ఆహారపు అలవాట్లతో ప్రపంచానికి చావొచ్చింది" అని ఫైర్ అవుతున్నారు. ఈ కొత్త వైరస్ పందుల నుంచే మనుషులకు సోకుతోందాని తెలుస్తోంది. మరో పక్క పొరుగు దేశం ఐన భారత్ తో సరిహద్దులో కుట్రలు పన్నుతున్న చైనాపై దాదాపు ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. అంతే కాకుండా ఒక్క పాకిస్తాన్ తప్పించి తన చుట్టూ ఉన్న దేశాలతో చైనా ఏదో ఒక కారణం తో శత్రుత్వాన్ని పెంచుకుంటోంది.

తాజాగా అసలు చైనాలో కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టిందో తేల్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతినిధులు చైనాకు వెళ్లి పరిశోధించ బోతున్నారు. ఒక వేళ ఆ పరిశోధనలో కరోనా వైరస్‌ని చైనా స్వయంగా ల్యాబ్‌లో తయారుచేసిందని తేలితే మాత్రం ప్రపంచ దేశాలు చైనాపై చాలా పెద్ద ఎత్తున పరిహారం కోరుతూ కేసులు వేసే అవకాశం ఉంది. ఇక అమెరికా ఐతే యుద్ధం వంటి తీవ్ర నిర్ణయాన్ని ప్రకటించినా ఆశ్చర్య పోనవసరం లేదు. మరో పక్క చైనా మాత్రం ఈ వైరస్‌ని అమెరికాయే సృష్టించిందని ఆరోపిస్తోంది. ఏది ఏమైనా చైనా కు ఒక వైరస్‌ల దేశంగా మాత్రం కొత్తగా గుర్తింపు వచ్చింది.