కేంద్ర బడ్జెట్ మీద కవిత స్పందన!

 

టీఆర్ఎస్ ఎంపీ కవిత కేంద్ర బడ్జెట్ మీద పార్లమెంట్‌‌లో స్పందించారు. బడ్జెట్‌లలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైళ్ళు, కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలేదని విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం జనం ఆశించిన స్థాయిలో సంస్కరణలను ప్రతిపాదించలేదని అన్నారు. గురువారం లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. దేశంలోని ధనమంతా కొందరు వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమవుతోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.