తెరాసకు షాక్.. కాంగ్రెస్ గూటికి సీనియర్ నేత.!!
posted on Sep 20, 2018 11:17AM
అసెంబ్లీ రద్దుతో ముందస్తు ఎన్నికల వేడి సృష్టించిన తెరాసకు అసంతృప్తి సెగ తగులుతుంది.. తెరాస ప్రకటించిన 105 స్థానాల్లో టిక్కెట్ ఆశించి దక్కని వారు.. అసంతృప్తితో నిరసన వ్యక్తం చేస్తున్నారు.. కొందరైతే పార్టీనే వీడుతున్నారు.. అలాంటి వారిలో ఒకరే రమేష్ రాథోడ్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత రమేష్ రాథోడ్ తెరాసకు రాజీనామా చేసి, కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.. టీడీపీ పోలిట్బ్యూరోలో కొనసాగుతున్న సమయంలో రమేష్ రాఠోడ్ ఏడాది కిందట ఖానాపూర్ ఎమ్మెల్యే టిక్కెట్టే ఒప్పందంగా తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు.. చివరి నిమిషంలో తెరాస టిక్కెట్టు నిరాకరించడంతో ఈ నెల ఎనిమిదో తేదీన ఉట్నూర్ కేంద్రంగా భారీ ర్యాలీ నిర్వహించారు.. టిక్కెట్ రాకపోయినా ఖానాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీచేయడం ఖాయమని స్పష్టం చేశారు.. అయితే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపిన ఆయన రేపు గాంధీభవన్ వేదికగా ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.. ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు.