75 అన్నారు.. 69 ప్రకటించారు!

 

 

 

శుక్రవారం నాడు టీఆర్ఎస్ అసెంబ్లీకి పోటీ చేసే 75 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని, ఆ లిస్టు ఆల్రెడీ తయారైందన్న వార్తలు వచ్చాయి. అయితే తీరా కేసీఆర్ 69 మందితో మాత్రమే లిస్టు ప్రకటించాడు. వాళ్ళలో పరకాల ఎమ్మెల్యే బిక్షపతి పేరు లేదు. పరకాల సీటును కొండా సురేఖ భర్త కొండా మురళికి ఇవ్వాలన్న ఉద్దేశంతో బిక్షపతికి కేసీఆర్ హేండిచ్చాడని, దీంతో బిక్షపతి బీజేపీ లేదా కాంగ్రెస్‌లో చేరాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో ఐదుగురి పేర్లు గల్లంతయ్యాయి. ఆల్రెడీ టిక్కెట్లు ఖరారైనప్పటికీ వాళ్ళ పేర్లు ఎందుకు ప్రకటించలేదని ఆరా తీస్తే, ఆ ఐదుగురూ కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యే ఆలోచనలో వున్నారట. అందుకే లిస్టులో వాళ్ళ పేర్లు ప్రకటించలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.