తనపై రేప్ కేసు పెట్టిన మహిళను పెళ్లాడిన ఎమ్మెల్యే!!

 

ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు పెట్టిన మహిళను చివరకు ఆ ఎమ్మెల్యే పెళ్లి చేసుకున్న ఘటన త్రిపుర రాష్ట్రంలో జరిగింది. త్రిపురలో ఐపీఎఫ్‌టీ పార్టీ ఎమ్మెల్యే ధనుంజోయ్‌పై.. దలాయి ప్రాంతానికి చెందిన ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టింది. ఎమ్మెల్యే తనను బలవంతం చేశాడని, పెళ్లి చేసుకోమని కోరితే నిరాకరిస్తున్నాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తనతో ఎంతో కాలంగా సన్నిహితంగా ఉండి ఇప్పుడు మాట మార్చి తనను మోసం చేసాడని ఆరోపించింది. మరోపక్క.. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే కోర్టు మెట్లు ఎక్కారు. బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. బయటపడటానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆయన వినతిని కోర్టు తిరస్కరించింది. దీంతో చేసేదేంలేక.. ఎమ్మెల్యే ఆ మహిళతో వివాహానికి అంగీకరించారు. ఆదివారం వారి వివాహం జిరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులూ హాజరయ్యారు.