వాజ్‌పేయి ఇకలేరంటూ గవర్నర్ ట్వీట్

 

కెమేరామెన్ గంగతో రాంబాబు సినిమా చూసే ఉంటారు.. ఆ సినిమాలో బ్రహ్మానందం ముందస్తు చర్యగా ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు గురించి బ్రతికుండగానే చనిపోయినట్టు వార్త సిద్ధం చేసి ఉంచుతాడు.. సరిగ్గా అలాంటి సంఘటనే వాజ్‌పేయి విషయంలో జరిగింది.. ఓ వైపు వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అందరూ ఆందోళన చెందుతుంటే, మరోవైపు త్రిపుర గవర్నర్ తథాగత రాయ్, వాజ్‌పేయి ఇకలేరంటూ ట్వీట్ చేసారు.. ఈ ట్వీట్ వైరల్ అవటమే కాదు, బ్రతికుండగానే చంపేశారు అంటూ ఆయన మీద విమర్శలు వెల్లవెత్తాయి.. దీంతో ఆయన తన తప్పు తెలుసుకొని ఓ తప్పుడు న్యూస్ చూసి పొరపడ్డాను క్షమించండి అంటూ ట్వీట్ చేసారు.