స్కూలు బస్సు.. రైలు ప్రమాదం: నేతల దిగ్భ్రాంతి

 

మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో 26 మంది చిన్నారులు మరణించడం పట్ల పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దుర్ఘటన మీద తన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను చేపట్టాలని పిలుపు ఇచ్చారు. అలాగే ఈ దుర్ఘటన మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ నేత జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది.