రైలు ప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు

 

మాసాయిపేట రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కలిశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. ఐదు లక్షలు, రైల్వేశాఖ తరపున రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, రూ. 1లక్ష ఇన్సూరెన్స్‌ను మంత్రి హరీశ్‌రావు అందజేశారు.