స్కూలు బస్సును ఢీకొన్న రైలు: 26 మంది మృతి

 

మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. గురువారం ఉదయం స్కూలు బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో 26 మంది చిన్నారులు మరణించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాపూర్ నుంచి మాదాపేట వైపు వెళ్తుండగా మాసాపేట రైల్వే గేటు వద్ద నాందేడ్ - సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు స్కూలు బస్సును ఢీకొంది. రైల్వే గేటు వద్ద కాపలా లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.