స్కూలు బస్సు ప్రమాదం: మృతులు 16 మంది!

 

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద గురువారం ఉదయం స్కూలు బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో 26 మంది చిన్నారులు మరణించినట్టు మొదట్లో సమాచారం అందింది. అయితే ఈ ప్రమాదంలో 16 మంది విద్యార్థులు మాత్రం అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన 22 మంది విద్యార్థులు హైదరాబాద్‌లోని ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. గాయపడిన విద్యార్థులను మొదట హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రులలో చేర్పించిన అధికారులు ఆ తర్వాత అందర్నీ నగరంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది.