సెన్సార్ బోర్డు ఎదుట విషం తాగిన డైరెక్టర్
posted on Feb 15, 2013 5:33PM
తాను దర్శకత్వం వహించిన సినిమాకు సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదనే మనస్తాపంతో డైరెక్టర్ దుర్గాప్రసాద్ సెన్సార్ బోర్డు ఎదుట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సినీ రంగంలో తీవ్ర కలకలం సృష్టించింది. దుర్గాప్రసాద్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘లవ్ పాయిజన్' అనే చిత్రాన్ని నిర్మించారు. చాలా రోజుల క్రితం సినిమాను సెన్సార్ బోర్డ్ కు పంపించిన సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించిందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన బోర్డు కార్యాలయం ముందు ఈ రోజు విష౦ తీసుకున్నారు. ఈ విషయం గమనించిన కొందరు వెంటనే అతన్ని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.