దసరా నుంచి హైదరాబాద్‌లో ఫుల్లు కల్లు

 

హైదరాబాద్ మహానగర ప్రజలకు శుభవార్త. జంట నగరాల్లో కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గీత కార్మికులకు ఉపాధి కోసమే కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. కల్లు దుకాణాల ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కల్లీకల్లు నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో వున్న తాటి చెట్లను హైదరాబాద్ కల్లు సొసైటీలకు కేలాయిస్తామని, ప్రభుత్వం తరఫున తాటిచెట్ల పెంపకం చేపడతామని మంత్రి వెల్లడించారు. తాటి ఉత్పత్తులతో తినుబండారాల తయారీ అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. దసరా నుంచి హైదరాబాద్‌లో కల్లు విస్తారంగా లభిస్తుందని వివరించారు.