కరోనాతో టీటీడీ అర్చకుడి కన్నుమూత

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి రోజు దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. అక్కడ ఇక్కడ అని లేకుండా అన్ని ప్రాంతాలను కరోనా చుట్టేస్తోంది. ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమల కొండపై కూడా కరోనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలువురు అర్చకులు కరోనా బారిన పడ్డారు. ఐతే వీరిలో కొందరు కోలుకోగా తాజాగా కరోనా రక్కసి కారణంగా అర్చకుడు ఎన్వీ శ్రీనివాసాచార్యులు కన్నుమూశారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. నాలుగు రోజుల క్రితం ఆయన కరోనా సోకగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అయన వాస్తవానికి తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయంలో అర్చకులుగా ఉన్నారు. ఐతే డిప్యుటేషన్ పై తిరుమలకు వచ్చారు.