మాకేం సంబంధం లేదు.. అమూల్!
Published on: Sat Sep 21, 2024 1:05PM

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై వివాదంపై అమూల్ స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి తామెప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని వివరించింది. తమ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతోందని పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి తాము నెయ్యి సరఫరా చేశామన్న వార్తలలో వాస్తవం లేదని అమూల్ మాతృసంస్థ అయిన గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ పేర్కొంది.


