కంటైన్మెంట్ జోన్ గా తిరుమల

ప్రముఖ పుణ్య క్షేత్రమైన ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని సమాచారం.

కొన్ని రోజులుగా తిరుమలలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తిరుమలలో ఇప్పటి వరకు 84 మందికి కరోనా సోకినట్లు తేలింది. అలాగే, 17 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకిందని బోర్డు అధికారికంగా ప్రకటించింది.