TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పఠాన్‌చెరు రిట్రేడింగ్ వర్క్ షాప్‌లో బ్లాస్ట్ ..ఒకరు మృతి పలువురికి గాయాలు

Published on: Sat May 30, 2026 5:24PM

 

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని ఓ టైర్ రిట్రేడింగ్ వర్క్‌షాప్‌లో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వర్క్‌షాప్‌లో టైర్లకు సంబంధించిన పనులు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా డై (మోల్డ్) బ్లాస్ట్ కావడంతో అక్కడ ఉన్న వ్యక్తులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. సమాచారం మేరకు, వర్క్‌షాప్‌ను సందర్శించేందుకు వచ్చిన ఓ వ్యక్తి డై బ్లాస్ట్ తాకిడికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన సమయంలో మొత్తం ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రమాదంలో మరో వ్యక్తికి గాయాలు కాగా, అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మూడో వ్యక్తి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో ముత్తంగి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.