టైమ్స్ అత్యంత ప్రభావశీలురు సానియా.. ప్రియాంక చోప్రా
posted on Apr 22, 2016 3:35PM
ప్రఖ్యాత టైమ్ మేగజైన్ '100 మంది ప్రపంచ అత్యంత ప్రభావశీలుర' జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా చేసే ఈ సర్వేలే పలువురు భారతీయ ప్రముఖులకు చోటు దక్కడం విశేషం. వారిలో టెన్నిస్ తార సానియా మీర్జా, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్లకు స్థానం దక్కింది. కాగా ఇటీవలే సానియా మీర్జాకి పద్మభూషణ్ రాగా.. ప్రియాంక చోప్రాకి పద్మశ్రీ అవార్డ్ దక్కింది. ఇంకా, వీరితోపాటు సామాజిక ఉద్యమకారిణి సునీత నరైన్, ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్లు ఈ జాబితాలో ఉన్నారు. భారత సంతతికి చెందిన నటుడు అజీజ్ అన్సారీ, లాస్ట్ మైల్ హెల్త్ సంస్థ సీఈవో రాజ్ పంజాబీ కూడా టైమ్ జాబితాలో ఉన్నారు.