TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పల్నాడులో మూడు పెట్రోల్ బంకులు సీజ్

Published on: Tue Apr 28, 2026 2:10PM

పెట్రోల్ విక్రయాలలో అక్రమాలకు పాల్పడినా, కృత్రిమ కొరత సృష్టించినా సహించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అవి ఉట్టుట్టి హెచ్చరికలు కావని పల్నాడులో మూడు పెట్రోల్ బంక్ లను కలెక్టర్ కృతిక శుక్లా సీజ్ చేయడం ద్వారా నిరూపించారు.

పల్నాడులో ఇంధన విక్రయాలలో అక్రమాలకు పాల్పడుతున్న మూడు పెట్రోల్ బంకులను కలెక్టర్ సీజ్ చేశారు. నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న  మూడు ఫిల్లింగ్ స్టేషన్లను సీజ్ చేశారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలను పరిశీలిస్తూ పలు ప్రాంతాలలో పర్యటించిన కలెక్టర్..  బంకుల వద్ద పరిస్థితిని సమీక్షించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు హెచ్చరించారు.