కర్నూలు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
Published on: Sat Nov 2, 2024 2:11PM
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడిక్కడే చనిపోయారు. నందవరం మండలం ధర్మాపురం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఆటోలో వెళుతున్న మహిళలను కారు ఢీ కొట్టింది. చనిపోయిన వారిలో వీర నాగమ్మ(60), గౌరమ్మ(61) బేబీ(32)లు ఉన్నారు.రజియా అనే బాలిక పరిస్థితి విషమంగా ఉంది. రజియాను ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. కారు మితి మీగిన వేగంతో వెళ్లడం వల్లే ప్రమాదం చోటు చేసుకుంది.


