కాల్వలో పడి ముగ్గురు చిన్నారులు...



 ఖమ్మం జిల్లాలో ఘోరం జరిగింది. ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం చిన్న గంగారం గ్రామంలో స్నానానికి వెళ్ళిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ పాలెం వాగు కాల్వలో పడి మరణించారు. పెద్దల పర్యవేక్షణ లేకుండా నీటిలో స్నానానికి దిగిన ముగ్గురు చిన్నారులూ మునిగిపోయి మరణించారు. ఈ ముగ్గురి వయసు ఎనిమిది సంవత్సరాల లోపే. వీళ్ళు కాలువలో దిగుతుండగా ఎవరూ గమనించకపోవడంతో వీరు మరణించిన విషయం చాలా ఆలస్యంగా బయటపడింది.